రేవంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలు

రేవంత్ రెడ్డివి తప్పుడు ఆరోపణలు

ఖమ్మం: మెడికల్ సీట్ల దందా అంటూ రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో నడుస్తోన్న మెడికల్ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. అందులో మంత్రి పువ్వాడ అజయ్ పేరును ప్రస్తావించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. తమ మమత మెడికల్ కాలేజీకి సంబంధించి సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని నిరూపిస్తే కాలేజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానన్న అజయ్... నిరూపించకపోతే రేవంత్ రెడ్డి తన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. తనపై గవర్నర్ కు తప్పుడు ఫిర్యాదు చేసిన రేవంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. 20 ఏళ్లుగా తమ కాలేజీ దిగ్విజయంగా నడుస్తోందని, సీట్లు అమ్ముకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకుంటే... తమ కాలేజీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్ పై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చిరించారు. 

మరిన్ని వార్తల కోసం...

వైద్య సీట్ల దందాపై గవర్నర్ కు రేవంత్ లేఖ

బంగారు తెలంగాణ కాదు... అప్పుల తెలంగాణ